ఏపీలో క‌రోనా విల‌యం.. కొత్త‌గా ఎన్నికేసులంటే..?

10759 New corona cases in ap today.ఏపీలో గ‌డిచిన‌ 24 గంటల్లో 41,871 ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 10,759 పాజిటివ్ కేసులు నిర్ధ‌రాణ అయ్యాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 April 2021 1:37 PM GMT
AP corona case updates

ఏపీలో క‌రోనా విల‌య‌తాండ‌వం కొన‌సాగుతోంది. గ‌త కొద్ది రోజులుగా ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. గ‌డిచిన‌ 24 గంటల్లో 41,871 ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 10,759 పాజిటివ్ కేసులు నిర్ధ‌రాణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైప పాజ‌టివ్ కేసుల సంఖ్య 9,97,462కి చేరింది. అత్య‌ధికంగా చిత్తూరు జిల్లాలో 1474 కేసులు న‌మోదు కాగా.. అత్య‌ల్పంగా ప‌శ్చిమ గోదావ‌రిలో 90 కేసులు న‌మోదు అయ్యాయి.

నిన్న ఒక్క రోజే చిత్తూరు, కృష్ణా జిల్లాలో ఐదుగురు చొప్పున‌, క‌ర్నూలు, నెల్లూరు, ప్ర‌కాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ముగ్గ‌రు చొప్పున‌, తూర్పుగోదావ‌రి, గుంటూరు, విజ‌య‌న‌గ‌రంలో ఇద్ద‌రు చొప్పున‌, అనంత‌పురం, క‌డ‌ప‌, విశాఖ‌లో ఒక్కొక్క‌రు చొప్పున మ‌ర‌ణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,451కి చేరింది. నిన్న ఒక్క రోజే 3,992 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 9,22,977 కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 66,944 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,58,35,169 శాంపిల్స్ ను పరీక్షించారు.


Next Story