ఏపీ కరోనా అప్డేట్.. కొత్తగా ఎన్నికేసులంటే..?
106 New Corona cases in AP.ఏపీలో గడిచిన 24 గంటల్లో 35,804 కరోనా పరీక్షలు నిర్వహించగా 106 పాజిటివ్ కేసులు నిర్థరాణ
By తోట వంశీ కుమార్ Published on 2 March 2021 1:14 PM GMT
ఏపీలో గడిచిన 24 గంటల్లో 35,804 కరోనా పరీక్షలు నిర్వహించగా 106 పాజిటివ్ కేసులు నిర్థరాణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,90,080కి చేరింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 33 కేసులు నమోదు కాగా, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు. అదే సమయంలో 57 మంది కరోనా నుంచి కోలుకోగా.. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నా వారి సంఖ్య 8,82,137కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 7,169. కాగా.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,40,10,024 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్లో వెల్లడించింది.
#COVIDUpdates: 02/03/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) March 2, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,87,185 పాజిటివ్ కేసు లకు గాను
*8,79,242 మంది డిశ్చార్జ్ కాగా
*7,169 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 774#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/blagY1osVy