రాజధాని అమరావతిలోనే ఉంచాలి.. మంత్రి కిషన్‌రెడ్డితో మొరపెట్టుకున్న రైతులు

By సుభాష్  Published on  5 Jan 2020 9:00 AM GMT
రాజధాని అమరావతిలోనే ఉంచాలి.. మంత్రి కిషన్‌రెడ్డితో మొరపెట్టుకున్న రైతులు

ఏపీ రాజధాని అమరావతిలోనే ఉంచాలని గత 18 రోజులుగా రైతులు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. మరో వైపు వివిధ ప్రజా సంఘాలు, టీడీపీ, వామపక్షాలు ర్యాలీలు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాజధాని రైతులు, మహిళలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని కలిశారు. సికింద్రాబాద్‌లోని కార్యాలయంలో రైతులు మంత్రిని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. అమరావతిలోనే రాజధానిని ఉంచాలంటూ కిషన్‌ రెడ్డిని రైతులు వేడుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించేలా కృషి చేయాలని మంత్రికి విన్నవించారు. వారి విన్నపాన్ని విన్న కిషన్‌రెడ్డి సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తానని, రాజధాని అమరావతిలోనే ఉండే విధంగా చర్యలు చేపడతానని రైతులకు హామీ ఇచ్చారు.

Next Story