మహారాష్ట్రలో ఘోర ప్రమాదం
By Medi Samrat Published on 4 Nov 2019 7:12 AM GMTముఖ్యాంశాలు
- నలుగురు మృతి
- 30 మందికి గాయాలు
మహారాష్ట్రలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భోర్ఘాట్ వద్ద పుణె - ముంబయి జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
Next Story