అధికారులు అవినీతికి పాల్పడటం చట్టపరంగా నేరమని తెలిసినా.. కొన్ని చోట్ల ఉద్యోగులు అవినీతికి పాల్పడుతూనే ఉన్నారు. ఈ తరహాలోనే కడప జిల్లా రాజంపేటలో ఆర్ అండ్ బీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి.ప్రభాకర్రావు లంచం తీసుకుంటూ.. ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. అయితే రాయచోటికి చెందిన ఎస్.ఓబుల్రెడ్డి అనే కాంట్రాక్టర్కు సంబంధించిన బిల్లు మంజూరు విషయంపై లంచం డిమాండ్ చేశాడు. ఈ మేరకు కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.