తెలంగాణ‌లో విజృంభిస్తున్న క‌రోనా.. 24 గంట‌ల్లో 79 కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 May 2020 4:07 PM GMT
తెలంగాణ‌లో విజృంభిస్తున్న క‌రోనా.. 24 గంట‌ల్లో 79 కేసులు

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. గ‌త కొన్ని రోజులుగా త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్లే క‌నిపించిన క‌రోనా మ‌హ‌మ్మారి ఒక్క‌సారిగా పంజా విప్పింది. ఒక్క రోజులోనే కేసుల సంఖ్య రెట్టింపు అయ్యింది. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో కొత్త‌గా మ‌రో 79 కేసులు న‌మోదు అయ్యాయ‌ని తెలంగాణ ఆరోగ్య‌శాఖ హెల్త్ బులిటెన్‌లో వెల్ల‌డించింది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 1275 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 30 మంది మ‌ర‌ణించారు. ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన కేసుల్లో 801 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 444 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొత్త‌గా న‌మోదైన కేసుల‌న్ని కూడా జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం.

ఇప్ప‌టి వ‌ర‌కు వ‌రంగ‌ల్‌(రూర‌ల్), యాదాద్రి భువ‌న‌గిరి, వ‌న‌ప‌ర్తి జిల్లాలో ఒక్క క‌రోనా పాజిటివ్ కేసులు కూడా న‌మోదు కాలేదు. గ‌త 14 రోజులుగా ఒక్క క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కానీ జిల్లాలు రాష్ట్రంలో 26 ఉన్నాయి. దేశ‌వ్యాప్త లాక్‌ఢౌన్ మే 17 తో ముగుస్తుండ‌గా.. తెలంగాణ‌లో మాత్రం మే 29 వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగించిన సంగ‌తి తెలిసిందే.

79 new coronavirus cases in telangana

Next Story