ఏపీలో కొత్త‌గా 6,242 కేసులు.. 40 మ‌ర‌ణాలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Oct 2020 12:44 PM GMT
ఏపీలో కొత్త‌గా 6,242 కేసులు.. 40 మ‌ర‌ణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 72,811 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 6,242 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,06,790కి చేరింది.

కొవిడ్‌ వల్ల కృష్ణలో ఆరుగురు, అనంతపూర్‌లో ఐదుగురు, చిత్తూరులో ఐదుగురు, తూర్పు‌గోదావ‌రిలో న‌లుగురు, గుంటూరులో న‌లుగురు, నెల్లూరులో న‌లుగురు, ప్ర‌కాశంలో ముగ్గురు, విశాఖ‌ప‌ట్నంలో ముగ్గురు, శ్రీకాకుళంలో ఇద్ద‌రు, ప‌శ్చిమ‌గోదావ‌రిలో ఇద్ద‌రు, క‌ర్నూల్‌లో ఒక్క‌రు, విజ‌య‌న‌గ‌రంలో ఒక్క‌రు చొప్పున 40 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 5,981కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 6,58,875 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 54,400 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 411,

చిత్తూరులో 863,

ఈస్ట్‌ గోదావరిలో 826,

గుంటూరులో 562,

కడపలో 408,

కృష్ణలో 469,

కర్నూలులో 220,

నెల్లూరులో 413,

ప్రకాశంలో 582,

శ్రీకాకుళంలో 192,

విశాఖపట్నంలో 222,

విజయనగరంలో 221,

పశ్చిమ గోదావరి 853 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.



Next Story