ఏపీలో కరోనా కరాళనృత్యం.. కొత్తగా 6045 కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 July 2020 11:57 AM GMT
ఏపీలో కరోనా కరాళనృత్యం.. కొత్తగా 6045 కేసులు

ఏపీలో కరోనా ఉద్దృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 49,553 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 6045 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 64713కి చేరింది.

కొవిడ్‌ వల్ల గుంటూరులో పదిహేను మంది, కృష్ణలో పది మంది, పశ్చిమ గోదావరిలో ఎనిమిది మంది, తూర్పుగోదావరిలో ఏడుగురు, చిత్తూరులో ఐదుగురు, కర్నూలులో ఐదుగురు, విజయనగరంలో నలుగురు, ప్రకాశంలో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, కడపలో ఒక్కరు, నెల్లూరులో ఒక్కరు చొప్పున మొత్తం 65 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 823 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 32,127 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 31,763 మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 325,

చిత్తూరులో 345,

ఈస్ట్‌ గోదావరిలో 891,

గుంటూరులో 842,

కడపలో 229,

కృష్ణలో 151,

కర్నూలులో 678,

నెల్లూరులో 327,

ప్రకాశంలో 177,

శ్రీకాకుంలో 252,

విశాఖపట్నంలో 1049,

విజయనగరంలో 107,

పశ్చిమ గోదావరిలో 672 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.



Next Story