50 కిలోల బంగారంతో అమ్మవారి విగ్రహం..!
By న్యూస్మీటర్ తెలుగు Published on 26 Sep 2019 8:35 AM GMTప.బెంగాల్: కోల్ కతాలో దేవీ నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతాయి. ప్రతి వీధిలో అమ్మవారి విగ్రహాలు పెట్టి ఆరాధిస్తారు. ఈ సంవత్సరం, సెంట్రల్ కోల్ కతాలోని సంతోష్ మిత్రా కూడలి వద్ద 50 కిలోలు బంగారం ఉపయోగించి 13 అడుగులు ఎత్తుగల అమ్మవారి విగ్రహం తయారు చేయిస్తున్నారు.
రూ.20 కోట్ల విలువైన బంగారంతో ఆ విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. ఆ కనక దుర్గను పైనుంచి కింది వరకూ కనకంతో తయారు చేయిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం తులం బంగారం ధర రూ.40 వేల వరకు ఉంది. దీంతో ఈ విగ్రహం ఖరీదు దాదాపు రూ.20 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అయితే, ఈ కూడలిలో అమ్మవారి విగ్రహం కోసం బంగారం వాడటం ఇదే మొదటిసారి కాదు. 2017లో బంగారు చీరతో అమ్మను అలంకరించారు. 2018లో వెండి రధాన్ని కనకదుర్గమ్మ అధిరోహించినట్లు విగ్రహం చేశారు.
Next Story