తెలంగాణ‌లో క‌రోనా విల‌య‌తాండ‌వం.. ఒక్క‌రోజే 499 కేసులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Jun 2020 4:16 PM GMT
తెలంగాణ‌లో క‌రోనా విల‌య‌తాండ‌వం.. ఒక్క‌రోజే 499 కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 499 కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 6526 కేసులు నమోదు కాగా, 198 మంది మృతి చెందారు.

ఇక తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీలో 329 కేసులు నమోదు కావడంతో నగర వాసులు మరింత భయాందోళన చెందుతున్నారు. ఆ తర్వాత అత్య‌ధికంగా రంగారెడ్డి జిల్లాలో 129 కేసులు నమోదయ్యాయి. గ‌త వారం రోజులుగా తెలంగాణ‌లో అత్య‌ధికంగా కేసులు న‌మోద‌వుతుండ‌టంతో రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు తీవ్ర క‌ల‌వ‌రం చెందుతున్నారు.

ఇదిలావుంటే.. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 3352 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్‌ కాగా, ప్రస్తుతం 2976 మంది చికిత్స పొందుతున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో 51 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

Ts1

Next Story