ఏపీలో కొనసాగుతోన్న కరోనా విజృంభణ.. కొత్తగా 4944 కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 July 2020 11:48 AM GMT
ఏపీలో కొనసాగుతోన్న కరోనా విజృంభణ..  కొత్తగా 4944 కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా నిత్యం 4వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 37,162 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 4944పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 58668కి చేరింది.

కొవిడ్‌ వల్ల తూర్పుగోదావరిలో పది మంది, విశాఖపట్నంలో తొమ్మిది, చిత్తూరులో ఎనిమిది, శ్రీకాకుళంలో ఏడుగురు, అనంతపురంలో ఆరుగురు, పశ్చిమగోదావరిలో ఆరుగురు, గుంటూరులో ఐదుగురు, ప్రకాశంలో ఐదుగురు, కర్నూల్‌లో నలుగురు, కడపలో ఒక్కరు, విజయనగరంలో ఒక్కరు చొప్పున మొత్తం 62 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 758 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 25,574 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 32,336 మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 458,

చిత్తూరులో 560,

ఈస్ట్‌ గోదావరిలో 524,

గుంటూరులో 577,

కడపలో 322,

కృష్ణలో 424,

కర్నూలులో 515,

నెల్లూరులో 197,

ప్రకాశంలో 171,

శ్రీకాకుంలో 133,

విశాఖపట్నంలో 230,

విజయనగరంలో 210,

పశ్చిమ గోదావరిలో 623 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.



Next Story