ఏపీలో మ‌రో 48 క‌రోనా పాజిటివ్ కేసులు..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 May 2020 7:00 AM GMT
ఏపీలో మ‌రో 48 క‌రోనా పాజిటివ్ కేసులు..

ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభణ కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 9,284 సాంపిల్స్‌ను ప‌రీక్షించ‌గా.. 48 మందికి క‌రోనా పాజిటివ్‌గా వ‌చ్చిన‌ట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో తెలిపింది. కొత్త‌గా న‌మోదు అయిన కేసుల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 2,137 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డి 47 మంది మృతి చెందారు. మొత్తం న‌మోదు అయిన కేసుల్లో 1142 మంది డిశ్చార్జి కాగా.. 948 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

గత 24 గంటల్లో అనంతపురంలో 3, చిత్తూరులో 11, తూర్పు గోదావరిలో 4, గుంటూరులో 12, కృష్ణాలో 3, కర్నూలులో 7 చొప్పున కేసులు నమోదు అయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు క‌ర్నూలులో అత్య‌ధికంగా 591 కేసులు న‌మోదు కాగా.. గుంటూరులో 399, కృష్ణాలో 349, చిత్తూరులో 142, అనంత‌పురంలో 118, నెల్లూరులో 111 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

Untitled 5

Next Story