తెలంగాణ‌లో క‌రోనా విల‌య‌తాండ‌వం.. ఒక్క రోజులోనే 352 కేసులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Jun 2020 4:37 PM GMT
తెలంగాణ‌లో క‌రోనా విల‌య‌తాండ‌వం.. ఒక్క రోజులోనే 352 కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 352 కేసుల నమోదు కాగా, ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 6027 కేసులు నమోదు కాగా, 195 మంది మృతి చెందారు. ఇక తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీలో 302 కేసులు నమోదు కావడంతో నగర వాసులు మరింత భయాందోళన చెందుతున్నారు. ఆ తర్వాత అత్య‌ధికంగా రంగారెడ్డి జిల్లాలో 17, మేడ్చ‌ల్ జిల్లాలో 10 చొప్పున కేసులు నమోదయ్యాయి.

ఇదిలావుంటే.. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 3301 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్‌ కాగా, ప్రస్తుతం 2531 మంది చికిత్స పొందుతున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో 230 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

Ts1

Next Story