ఏపీలో కొత్త‌గా మ‌రో 33 క‌రోనా కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 May 2020 6:51 AM GMT
ఏపీలో కొత్త‌గా మ‌రో 33 క‌రోనా కేసులు

ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభణ కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 10,730 సాంపిల్స్‌ను ప‌రీక్షించ‌గా.. 33 మందికి క‌రోనా పాజిటివ్‌గా వ‌చ్చిన‌ట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో తెలిపింది. కొత్త‌గా న‌మోదు అయిన కేసుల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు 2051 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 46 మంది మృతి చెందారు. మొత్తం న‌మోదు అయిన కేసుల్లో 1056 మంది డిశ్చార్జి కాగా.. 949 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

గత 24 గంటల్లో చిత్తూరులో 10, తూర్పుగోదావ‌రిలో 1, కృష్ణాలో 4, క‌ర్నూలులో 9, నెల్లూరులో 9 కేసులు నమోదు అయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు క‌ర్నూలులో అత్య‌ధికంగా 584 కేసులు న‌మోదు కాగా.. గుంటూరులో 387, కృష్ణాలో 346, చిత్తూరులో 131, అనంత‌పురంలో 115, నెల్లూరులో 111 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

33 new corona cases in last 24 hours in AP

Next Story