తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం.. కొత్తగా 3 కేసులు
By తోట వంశీ కుమార్ Published on 4 May 2020 3:00 PM GMTతెలంగాణ రాష్ట్రంలో సోమవారం కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు రాష్ట్రంలో 3 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1085కి చేరింది. ఈ మహమ్మారి భారీన పడి 29 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 585 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగడా.. 471 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ రోజు నమోదైన కేసుల్లో జీహెఛ్ఎంసీ పరిధిలోనే నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు యాద్రాది భువనగిరి, వనపర్తి, వరంగల్ (రూరల్) జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు.
Also Read
తెలంగాణలో మే 21 వరకు లాక్డౌన్..?Next Story