తెలంగాణ‌లో క‌రోనా విజృంభ‌ణ‌.. నేడు కొత్త‌గా మ‌రో 269 కేసులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Jun 2020 3:58 PM GMT
తెలంగాణ‌లో క‌రోనా విజృంభ‌ణ‌.. నేడు కొత్త‌గా మ‌రో 269 కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 269 కేసుల నమోదు కాగా, ఒక‌రు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 5675 కేసులు నమోదు కాగా, 192 మంది మృతి చెందారు. ఇక తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీలో 214 కేసులు నమోదు కావడంతో నగర వాసులు మరింత భయాందోళన చెందుతున్నారు. ఆ తర్వాత అత్య‌ధికంగా రంగారెడ్డిలో 13, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌లో 10 కేసులు, కరీంనగర్ లో 8 కేసులు, జనగాంలో 5 చొప్పున కేసులు నమోదయ్యాయి.



ఇదిలావుంటే.. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 3,071 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్‌ కాగా, ప్రస్తుతం 2412 మంది చికిత్స పొందుతున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో 151 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

Next Story