తెలంగాణలో కొత్తగా 21 కరోనా పాజిటివ్ కేసులు
By తోట వంశీ కుమార్ Published on 3 May 2020 4:02 PM GMT![తెలంగాణలో కొత్తగా 21 కరోనా పాజిటివ్ కేసులు తెలంగాణలో కొత్తగా 21 కరోనా పాజిటివ్ కేసులు](https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/05/Untitled-2-8.jpg)
కరోనా మహమ్మారి రాష్ట్రంలో విజృంభిస్తుంది. రాష్ట్రంలో కొత్తగా మరో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1082కి చేరింది. ఈ మహమ్మారి భారీన పడి 29 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 545 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగడా.. 508 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ రోజు నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీలో 20 కేసులు నమోదు కాగా.. జగిత్యాల జిల్లాలో ఒక కేసు నమోదైంది. ఇప్పటి వరకు యాద్రాది భువనగిరి, వనపర్తి, వరంగల్ (రూరల్) జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు.
Also Read
తొమ్మిది నెలల గర్భం మాయమైంది..!Next Story