భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు.. 24 గంటల్లో 17,296కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Jun 2020 4:57 AM GMT
భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు.. 24 గంటల్లో 17,296కేసులు

భారత్‌లో రికార్డు సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమెదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 17,296 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 407 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో 4,90,401 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 15,301 మంది మృత్యువాత పడ్డారు.

భారత్‌లో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఒక్క రోజు వ్యవధిలో నమోదు అయిన అత్యధిక కేసులు ఇవే. మొత్తం నమోదు అయిన కేసుల్లో 2,85,637 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 1,89,463 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జూన్‌ 25 వరకు దేశంలో మొత్తం 77,76,228 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 2,15,446 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది. ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ నాలుగో స్థానంలో ఉంది.

Next Story