ఏపీలో 143కి చేరిన కరోనా కేసులు

By రాణి  Published on  2 April 2020 2:15 PM GMT
ఏపీలో 143కి చేరిన కరోనా కేసులు

ఏపీలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మూడ్రోజుల వ్యవధిలో సుమారు 90 కేసులు బయటపడ్డాయి. కొత్తగా నమోదైన కేసులన్నీ ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి నుంచే గుర్తించారు. ఇంకా ఢిల్లీ నుంచి వచ్చినవారేవరైనా ఉంటే స్వచ్ఛందంగా వచ్చి రక్తపరీక్షలు చేయించుకోవాలంటు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. గురువారం సాయంత్రానికి 8 మందికి కరోనా పాజిటివ్ రావడంతో 143 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అధికంగా కృష్ణాజిల్లాలో కొత్తగా 8 కేసులు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదైనట్లు తెలిపింది. గురువారం ఒక్కరోజే 11 కేసులు నమోదయ్యాయి.

Also Read : నిబంధనల్ని ఉల్లంఘిస్తే జైలుకే..లాక్ డౌన్ పై కేంద్రం సీరియస్

ఇటు తెలంగాణలోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ నుంచి 2200 మంది ఢిల్లీ కి వెళ్లొచ్చారని గుర్తించారు. ప్రస్తుతం 127 కేసులు నమోదవ్వగా..14 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరో 9 మంది కరోనాతో మరణించారు. ఇక దేశ వ్యాప్తంగా అయితే కరోనా బాధితుల సంఖ్య 2000 దాటింది. 50 మంది మృతి చెందారు. దేశంలో కరోనా మరింత విజృంభించక ముందే కట్టడి చేయాలంటే ప్రజలు సహకరించాలని కేంద్రం విజ్ఞప్తి చేస్తోంది.

Also Read : ఏప్రిల్‌ 15కు లాక్‌డౌన్‌ ముగుస్తుందా..?

ప్రపంచ వ్యాప్తంగా 9,38,205 కరోనా కేసులు నమోదవ్వగా..47,781 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా ఇటలీలో 13 వేలకు పైగా మరణాలు సంభవించాయి. అగ్రరాజ్యం అమెరికా కూడా కరోనా ధాటికి కుదేలవుతోంది.

Next Story