ఐపీఎల్‌ 2020 ప్రసార హక్కులను సొంతం చేసుకున్న 'యప్‌టీవీ'

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Sep 2020 7:12 AM GMT
ఐపీఎల్‌ 2020 ప్రసార హక్కులను సొంతం చేసుకున్న యప్‌టీవీ

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్) 2020 సీజన్‌ మరో రెండు రోజుల్లో ఆరంభం కానుంది. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌ యూఏఈ వేదికగా జరుగునున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా తొలి సారి ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు ఆడనున్నారు. ఇప్పటికే అన్ని జట్లు టైటిల్‌ సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ యప్‌ టీవీ ఐపీఎల్‌ 13వ సీజన్‌ ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. మొత్తం 60 మ్యాచ్‌లకు డ్రీమ్ 11 ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 హక్కులను సొంతం చేసుకుంది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం 10 కంటే ఎక్కువ ప్రాంతాలలో ఈ మ్యాచ్‌లను లైవ్‌లో ప్రసారం చేయనున్నది.

కరోనా కారణంగా ఈ సారి అంతర్జాతీయ సిరీస్‌ లు ఏవీ లేకపోవడంతో ఈ సారి ఐపీఎల్‌ను వీక్షించే వారి సంఖ్య పెరగనుందని పలు అధ్యయనాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా, కాంటినెంటల్ యూరప్, మలేషియా, సౌత్ ఈస్ట్ ఆసియా (సింగపూర్ మినహా), శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవులు, మధ్య ఆసియా, మధ్య మరియు దక్షిణ అమెరికా తదితర చోట్ల ఐపీఎల్‌ మ్యాచ్‌లను యప్‌టీవీ ప్రత్యక్ష్య ప్రసారం చేయనుంది. అసోసియేషన్ గురించి యప్ టీవీ వ్యవస్థాపకుడు మరియు సిఇఒ - ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ, “గత కొన్నేళ్లుగా, ఐపీఎల్ దేశంలో అత్యంత ప్రియమైన క్రికెట్ టోర్నమెంట్‌గా మారింది. లాక్‌డౌన్‌ మధ్య, ఇది ప్రేక్షకులలో కొత్త సంచలనం, ఆశావాదం మరియు వ్యామోహానికి దారి తీస్తుంది. ఐపీఎల్ యొక్క ప్రత్యక్ష అనుభవం రద్దీగా ఉండే స్టేడియాలకు బదులుగా వారి ఇళ్ల నుండి, అంకితమైన టెక్నాలజీ వీక్షణ అనుభవం మరియు తక్షణ వర్చువల్ అనుభవం అభిమానుల కోసం ఈ సంవత్సరం టోర్నమెంట్‌ను మెరుగుపరుస్తాయి, ఈ ప్రసార హక్కులు యప్ టీవీ ప్రేక్షకుల సంఖ్యను ఆకాశానికి ఎత్తడానికి సహాయపడతాయి.” అని అన్నారు.

దక్షిణాసియా కంటెంట్ కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నెట్ ఆధారిత టీవీ మరియు ఆన్-డిమాండ్ సర్వీస్ ప్రొవైడర్‌లలో ఒకటైన యప్‌టీవీ, 250 కంటే ఎక్కువ టీవీ ఛానెల్‌లు, 3000+ సినిమాలు మరియు 14 భాషల్లో 100+ టీవీ షోలను అందిస్తోంది.

Next Story