యరపతినేనిపై కేసుల నివేదికను కేంద్రానికి పంపిన ఏపీ సర్కార్
By న్యూస్మీటర్ తెలుగు Published on : 24 Sept 2019 8:41 PM IST

అమరావతి: మాజీ ఎమ్మెల్యే యరపతినేనిపై ఉన్న ఆరోపణలు, కేసులకు సంబంధించిన వివరాలతో కేంద్రానికి ఏపీ ప్రభుత్వం నివేదిక పంపింది. మైనింగ్ తవ్వకాలకు సంబంధించిన వివరాలను కేంద్రానికి పంపినట్లు తెలుస్తోంది. యరపతినేని మీద ఉన్న ఆరోపణలపై రాష్ట్రస్థాయిలో సీఐడీ విచారణ పూర్తి చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు సీబీఐకి అందజేసినట్లు సమాచారం. ఏపీలో సీబీఐ విచారణకు అనుమతి పునరుద్ధరించిన తర్వాత ఆ శాఖకు అప్పగించిన తొలి కేసు ఇది.
Next Story