క్వారంటైన్‌లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

By సుభాష్  Published on  22 July 2020 9:03 AM GMT
క్వారంటైన్‌లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా టెన్షన్‌ పట్టుకుంది. గత కొన్ని రోజులుగా ఆయన పలు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. అయితే ఆయన అస్వస్థకు గురైనట్లు సమాచారం. దీంతో ముందు జాగ్రత్తగా ఆయన హోంక్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన అధికారిక ట్విట్టర్‌ఖాతాలో పోస్టు చేశారు.

తాను ఓ వారం పది రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండేందుకు నిర్ణయించుకున్నానని, అత్యవసర పరిస్థితుల్లో ఫోన్‌ ద్వారా అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. కాగా, విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు పుకార్లు వ్యాపిస్తున్నాయి. అయితే కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.



Next Story