వనపర్తి జిల్లా: ఈ మధ్య మొసళ్లు రోడ్ల మీదకు వస్తున్నాయి. వర్షాలు బాగా పడటం వల్లనేమో..వరదలు బాగా రావడం కారణమేమో మొసళ్లు జనాలను పలకరిస్తున్నాయి. మొసళ్లను చూసి జనాలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా..జిల్లాలోని మాధనాపూర్ మండలంలో దుప్పల్లి బలిజవాని చెరువు దగ్గర మొసలి రోడ్డు మీదకు వచ్చింది. దీంతో జనాలు భయంతో పరుగులు తీశారు.