కిక్కిరిసిన ‘మెట్రో’ స్టేష‌న్లు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Oct 2019 6:41 AM GMT
కిక్కిరిసిన ‘మెట్రో’ స్టేష‌న్లు

హైద‌రాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సులు రోడ్డెక్కపోవడంతో ‘మెట్రో’కు ప్రయాణికుల తాకిడి అధికమయింది. శనివారం ఉదయం నుంచి బస్సులు లేకపోవడంతో జనాలు మెట్రో రైళ్లను ఆశ్రయించడంతో అవి కిక్కిరిసిపోయాయి. స‌మ్మె కార‌ణంగా ఉదయం 5 గంటల నుంచే మెట్రో సర్వీసులు ప్రారంభం అయ్యాయి. అర్థరాత్రి 12.30 గంటల వరకూ స‌ర్వీసులు అందుబాటులో వుంటాయి. రద్దీగా ఉంటే ప్రతి మూడు నిమిషాలకు ఓ రైలును నడపనున్నారు. రద్దీని నియంత్రించేందుకు అదనపు టికెట్‌ కౌంటర్లను ఏర్పాటు చేశారు.

Next Story