హైదరాబాద్: టీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. తక్షణమే ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించేలా ఆదేశించాలంటూ ఓయూ రీసెర్చ్ స్కాలర్ సురేంద్ర సింగ్ ఆదివారం ఈ పిల్ దాఖలు చేశారు. అలాగే కార్మికుల సమస్యలపై కమిటీ వేయాలని ఆయన తన పిటిషన్ లో కోరారు. ఈ రోజు 4 గంటలకు హైకోర్టు హౌస్ మోషన్ పిటిషన్ కు అనుమతి ఇచ్చింది. పిటిషన్ పై కుందన్ బాగ్ లోని జస్టిస్ రాజశేఖర్ రెడ్డి బంగ్లాలో విచారణ జరుగనుంది.