తెలంగాణలో కొత్తగా ఎన్ని కేసులంటే..

By సుభాష్  Published on  8 Nov 2020 5:38 AM GMT
తెలంగాణలో కొత్తగా ఎన్ని కేసులంటే..

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,440 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,50,331 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 1377 మంది మృతి చెందారు. ఇక తాజాగా 1,481 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 2,29,064 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.55 శాతం ఉండగా, దేశంలో 1.5 శాతం ఉంది.

ఇక రాష్ట్రంలో కోలుకున్నవారి రేటు 91.50 శాతం ఉండగా, దేశంలో 92.4 శాతం ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం యాక్టివ్‌ కేసులు 19,890 ఉండగా, హోం ఐసోలేషన్‌లో 17,135 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా అత్యధికంగా పాజిటివ్‌ కేసులు జీహెచ్‌ఎంసీలో 278, మేడ్చల్‌ మల్కాజిగిరి 133, రంగారెడ్డి 112 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇతర జిల్లాల్లో వంద లోపు కేసులు నమోదయ్యాయి.

Next Story