తెలంగాణలో కొత్తగా 2,103 కేసులు

By సుభాష్  Published on  30 Sep 2020 4:07 AM GMT
తెలంగాణలో కొత్తగా 2,103 కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ప్రతిరోజు రెండువేలకుపైగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,103 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 11 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,91,386 కేసులు నమోదు కాగా, మొత్తం 1127 మంది మృతి చెందారు. ఇక గడిచిన 24 గంటల్లో 2,243 మంది కోలుకోగా, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్నవారి సంఖ్య 1,60,933 ఉన్నారు. ఇక రాష్టర్ంలో మరణాల రేటు 0.58 శాతం ఉండగా, దేశంలో 1.56 శాతం ఉంది. ఇక కోలుకున్నవారి రేటు రాష్ట్రంలో 84.08 శాతం ఉండగా, దేశంలో 83,27 శాతం ఉంది. ఇక యాక్టివ్‌ కేసులు 29,326 ఉన్నాయి.

అలాగే గడిచిన 24 గంటల్లో జిల్లాల వ్యారిగా పాజిటివ్‌ కేసులు.. జీహెచ్‌ఎంసీలో 298, కొత్తగూడెం 102, కరీంనగర్‌ 103, మేడ్చల్‌ మల్కాజిగిరి 176, నల్గొండ 141, రంగారెడ్డి 172 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇతర జిల్లాల్లో వంద లోపు కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

Next Story