దీపావళికి బాలీవుడ్‌ ప్రేక్షకులను అలరిస్తున్న ఆ మూడు సినిమాలు‌..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Oct 2019 12:16 PM GMT
దీపావళికి బాలీవుడ్‌ ప్రేక్షకులను అలరిస్తున్న ఆ మూడు సినిమాలు‌..!

ముంబై: ఈ దీపావళి బాలీవుడ్‌ ప్రేక్షకులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. దీపావళి రోజు బాలీవుడ్‌ నుంచి ఒకే సారి మూడు సినిమాలు బరిలో నిలిచాయి. దీంతో ఈ దీపావళి బాలీవుడ్‌ ప్రేక్షలకు కన్నుల పండుగగా మారింది.

అంచనాలను మించింది: అక్షయ్‌కుమార్‌ ‘హౌస్‌ఫుల్‌ 4’,.. తాప్సి ‘శాండ్‌ కీ ఆంఖ్‌’,.. రాజ్‌కుమార్‌ రావు ‘మేడిన్‌ చైనా’ చిత్రాలు..ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే భారీ తారాగణంతో తెరకెక్కిన.. ‘హౌస్‌ఫుల్‌ 4’, చిత్రం అంచనాలకు తగినట్టుగానే ఆరంభ వసూళ్లు రాబట్టింది. తొలిరోజు ఈ సినిమా రూ.19.08 కోట్లు వసూలు చేసింది. అయితే ఇంకా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని బాలీవుడ్ వర్గాలు అంచానా వేస్తున్నాయి.

నిదానంగానే ఉంది: ప్రముఖ మహిళా షూటర్లు ప్రకాషి తోమర్‌, చంద్రో తోమర్‌ జీవిత కథ ఆధారంగా ‘శాండ్‌ కీ ఆంఖ్‌’ బాక్సాఫీస్‌ వద్ద కాస్త నిదానంగా వసూళ్లు రాబడుతోంది. ఈ చిత్రంలో..తాప్సి పొన్ను, భూమి పడ్నేకర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. మొదటి రోజు దాదాపు రూ. 4.5 కోట్లు కలెక్షన్లు తెచ్చుకుంది.

విభిన్న కథ: విలక్షణ నటుడు రాజ్‌కుమార్‌ రావు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం‘మేడిన్‌ చైనా’. ఈ చిత్రం తొలి రోజు సుమారు రూ. 3 కోట్లు రాబట్టింది. దీనిలో సీనియర్‌ నటులు పరాశ్‌ రావల్‌, బొమన్‌ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించారు. విభిన్న కథలతో తెరకెక్కిన ఈ మూడు సినిమాల్లో ప్రేక్షకులు ఏ సనిమాను ఆదరిస్తారో చూడాలి.

Next Story