అమరావతి : గ్రామ సచివాలయ ఉద్యోగాలు సంపాదించుకున్న ఉత్సాహంలో తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారని వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. మరో వైపు వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్లో లబ్ధిదారుల జాబితా వెలువడి గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొందన్నారు. ఇదిలా ఉంటే టీడీపీ నేత చంద్రబాబునాయుడు మాత్రం పులివెందుల పంచాయతీ, జె-ట్యాక్స్ అని ఏడుపు రాగాలు తీస్తున్నారని.. అందుకే క్షేత్ర స్థాయిలో ప్రజలు తుపుక్కుమని ఊస్తున్నారంటూ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో విమర్శించారు.
�
�