దారుణం.. డెలివరీ చేస్తూ మధ్యలో ఆపేసిన వైనం.. పసికందు మృతి

నల్లగొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. డెలివరీ మధ్యలో నిలపడంతో పసికందు మృతి.

By Srikanth Gundamalla  Published on  18 July 2023 12:42 PM GMT
Nurse, stopped mid-delivery, Child Dead, Nalgonda,

దారుణం.. డెలివరీ చేస్తూ మధ్యలో ఆపేసిన వైనం.. పసికందు మృతి

నల్లగొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఆస్పత్రిలో డెలివరీ కోసం వెళ్లింది మహిళ. అక్కడ వైద్యులు అందుబాటులో లేరు. దాంతో.. నర్సులే మహిళకు డెలివరీ చేసే ప్రయత్నం చేశారు. మధ్యలో తమ వల్ల కాదంటూ వదిలేశారు. వెంటనే మరో ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే పసికందు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌లో చోటు చేసుకుంది ఈ ఘటన. ఒక మహిళ డెలివరీ కోసం ప్రయివేట్‌ ఆస్పత్రికి వెళ్లింది. డెలివరీకి వెళ్లిన సమయంలో ఆస్పత్రిలో డాక్టర్లు అందుబాటులో లేరు. అప్పటికే ఆమె నొప్పులతో బాధపడుతోంది. వైద్యులు లేరని ఆమెను వెనక్కి పంపకుండా ఆస్పత్రిలోని నర్సులో డెలివరీ చేసేందుకు ప్రయత్నం చేశారు. సగం వరకు బాగానే నడిచింది. కానీ ఉన్నట్లుండి ఆపరేషన్ మధ్యలో వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. భయంతో డెలివరీ పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేశారు. సదురు మహిళ కుటుంబ సభ్యులు బతుకు దేవుడా అంటే నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే.. మహిళను ఆస్పత్రికి తరలించే సరికి పసికందు మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. దాంతో.. గర్భిణి బంధువులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

దీనికంతటికీ కారణంగా ప్రయివేట్‌ ఆస్పత్రినే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న ధర్నా నిర్వహించారు. మీ వల్లే పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయిందని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా వెంటనే ఆస్పత్రి వద్దకు వచ్చారు. బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా.. బాధిత కుటుంబ సభ్యులకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ.. బాధిత బంధువులు మాత్రం ఏమాత్రం తగ్గకుండా ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story