అందుకే బీఆర్ఎస్‌కు ఒక్క ఎంపీ సీటు రాలేదు: మంత్రి కోమటిరెడ్డి

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు బిగ్‌ షాక్‌ తగిలిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla
Published on : 15 Jun 2024 3:57 PM IST

minister komati reddy, comments,  brs, telangana ,

 అందుకే బీఆర్ఎస్‌కు ఒక్క ఎంపీ సీటు రాలేదు: మంత్రి కోమటిరెడ్డి 

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు బిగ్‌ షాక్‌ తగిలిన విషయం తెలిసిందే. ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవలేకపోయింది. కొన్ని స్థానాల్లో అయితే ఏకంగా మూడోస్థానానికి పరిమితం అయ్యింది. గతంలో అధికారంలో ఉన్న పార్టీ ఈ మేరకు పడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా ఇదే అంశంపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. త్వరలోనే ఆపార్టీ బీజేపీలో విలీనం కాబోతుందంటూ సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారంటూ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో పదేళ్ల పాటు పాలన సాగించిన బీఆర్‌ఎస్‌కు ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ శకం ముగిసిందని కామెంట్స్ చేశారు. హరీశ్‌రావుకు కాంగ్రెస్‌ పార్టీని విమర్శించే నైతిన హక్కుల లేదన్నారు కోమటిరెడ్డి. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో భారీ అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు.

విద్యను పట్టించుకోలేదనీ.. అలాగే నిరుద్యోగులను నిర్లక్ష్యం చేశారని అన్నారు. అందుకే బీఆర్ఎస్‌ ప్రతి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతూ వస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. దక్షిణ తెలంగాణను కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్నచూపు చూశారని అన్నారు. అందుకే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు రాలేదని చెప్పారు. ఇక రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ఆగస్టు 15 నాటికి రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.

Next Story