ఉద్యోగం కోసం నాలుగేళ్ల కిందట సూసైడ్..ఇప్పుడు ఫైనల్‌ టెస్టుకి కాల్‌లెటర్

తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla
Published on : 22 Jun 2024 6:57 AM IST

job call letter,  man died,  Telangana,

ఉద్యోగం కోసం నాలుగేళ్ల కిందట సూసైడ్..ఇప్పుడు ఫైనల్‌ టెస్టుకి కాల్‌లెటర్

తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు ఉద్యోగం రావడం లేదని నాలుగేళ్ల కిందట ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే.. తాజాగా అతనికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉందనీ.. ఫైనల్‌ టెస్టుకు హాజరుకావాలంటూ కాల్‌లెటర్ వచ్చింది. ఈ కాల్‌ లెటర్ గురించి తెలుసుకున్న బంధువులు, స్థానికులు అయ్యో అనుకుంఉటన్నారు.

ఎన్‌పీడీసీఎల్‌లో జూనియర్ లైన్‌మెన్ పోస్టుల భర్తీ కోసం 2018లో అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించారు. అయితే.. మిగులు పోస్టు భర్తీ విషయంలో కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. మెరిట్ ప్రకారం నియామకాలను చేపట్టారు అధికారులు. ఈ క్రమంలోనే మంచిర్యాల జిల్లాలోని మందమర్రికి చెందిన జీవన్‌ కుమార్‌కు విద్యుత్‌ స్తంభం ఎక్కే చివరి పరీక్షకు హాజరుకావాలని కాల్‌లెటర్‌ పంపారు. ఈ నెల 24న ఈ పరీక్ష ఉంటుందని లెటర్‌లో పేర్కొన్నారు అధికారులు. దాన్ని తీసుకొచ్చిన పోస్టుమెన్ అతను మరణించాడని తెలుసుకుని తిరిగి వెనక్కి తీసుకెళ్లిపోయారు.

మందమర్రి మొదటిజోన్‌కు చెందిన సిద్దెంకి మొండయ్య, సరోజ దంపతుల కుమారుడే నవీన్‌ జీవన్ కుమార్. అయితే.. వీరి కుటుంబంలో ప్రస్తుతం ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఈ దంపతులకు నవీన్, అనూష, ఆదిత్య, జీవన్ కుమార్ నలుగురు సంతానం. వీరిలో ఇద్దరు కుమార్తెలు మానసిక దివ్యాంగులు. జీవన్ కుమార్ 2014లోనే ఐటీఐ పూర్తి చేశాడు. అనారోగ్యంతో అక్క ఆదిత్య 2018లో చనిపోగా.. తల్లి సరోజ 2019లో చనిపోయారు. ఉద్యోగం రాకపోవడంతో 2020 మార్చిలో జీవన్ ఆత్మహత్య చేసుకున్నారు. ఉరివేసుకుని చనిపోయాడు. ఆ తర్వాత అక్క అనూష, తండ్రి మొండయ్య కూడా చనిపోయారు. ప్రస్తుతం వీరి ఇంట్లో పెద్ద కొడుకు నవీన్‌ ఒక్కడే బతికి ఉన్నారు.

Next Story