టీడీపీ కార్యాలయం వైఎస్‌ఆర్‌ సీపీకి..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Sep 2019 12:31 PM GMT
టీడీపీ కార్యాలయం వైఎస్‌ఆర్‌ సీపీకి..!

ఢిల్లీ: పార్లమెంట్‌లో టీడీపీ కార్యాలయాన్ని వైఎస్ఆర్‌ సీపీకి కేటాయించారు లోక్‌సభ సెక్రటేరియట్. సుదీర్ఘకాలంగా పార్లమెంట్‌లోని నెంబర్ 5 కార్యాలయంలోనే టీడీపీ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ 3స్థానాలకే పరిమితం అయింది. టీడీపీ రాజ్యసభ ఎంపీలూ బీజేపీలో చేరారు. దీంతో..పార్టీల సంఖ్యాబలం ఆధారంగా ఆఫీస్‌లు కేటాయించినట్లు లోక్‌సభ సెక్రటేరియట్ తెలియజేసింది.

Next Story