విడిపోయిన జంట‌ను క‌లిపిన క‌రోనా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 March 2020 6:22 AM GMT
విడిపోయిన జంట‌ను క‌లిపిన క‌రోనా

క‌రోనా వైర‌స్‌(కొవిడ్‌-19) ప్ర‌పంచాన్ని భ‌య‌ప‌డుతోంది. ఇప్ప‌టికే ఈ మ‌హ‌మ్మారి ధాటికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా 19వేల మందికి పైగా మృత్యువాత ప‌డగా.. నాలుగున్న‌ర ల‌క్ష‌ల మంది క‌రోనా పాజిటివ్‌తో ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. మ‌న దేశంలో క‌రోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి ధాటికి భార‌త్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 12 మంది మ‌ర‌ణించ‌గా.. 600 పైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి ఇప్ప‌టికే కేంద్రం దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ ను విధించింది. దీంతో ప్ర‌జ‌లంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు.

ఇదిలా ఉండ‌గా..క‌రోనా కార‌ణంగా విడిపోయిన బాలీవుడ్ జంట మ‌ళ్లీ క‌లిసార‌ట‌. అది ఎవ‌రో కాదండి బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, ఆయన భార్య సుసానే. 2014లో వీరిద్ద‌రు ప‌ర‌స్ప‌ర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. అయితే వీరి పిల్ల‌ల కోసం అప్పుడ‌ప్పుడు కలుస్తుంటారు. తాజాగా ఈ జంటను కరోనా వైరస్ ఒకటి చేసింది. దేశమంతా 21 రోజుల పాటు లాక్ డౌన్ అయిన నేపథ్యంలో పిల్లలతో కలిసి ఒకే ఇంట్లో ఉండాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని హృతిక్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

తమ పిల్లలు హ్రేహాన్, హృదాలతో కలసి ఉండేందుకు సుసానే తన ఇంటికి వచ్చిందని హృతిక్ తెలిపాడు. ఈ 21 రోజులు తామంతా కలిసే ఉంటామని చెప్పారు. సుసానే గత కొన్ని రోజులుగా తమ ఇంట్లోనే ఉంటూ పిల్లల్ని చూసుకుంటోందని తెలిపాడు. పిల్లల పట్ల ఆమెకు ఎంత ప్రేమ ఉందనడానికి ఇదే నిదర్శనమని చెప్పాడు. తల్లిదండ్రుల బాధ్యతలను గుర్తు చేస్తూ 'నీవు తీసుకున్న నిర్ణయానికి థ్యాంక్స్ సుసానే' అన్నాడు హృతిక్.

Next Story