తిరుపతి: రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్ రావల్సిన స్పైస్ జెట్ విమానం నాలుగు గంటలు లేట్ అవుతుంది. దీనిపై ఇప్పటి వరకు స్పైస్ జెట్ మేనేజ్ మెంట్ స్పందించలేదు. ప్రయాణికులు రేణిగుంట విమానాశ్రయంలో పడిగాపులు కాస్తున్నారు. ఎందుకు లేట్ అయింది..విమానం ఎప్పుడు వస్తుంది అని చెప్పడానికి కూడా ఎవరు రాలేదని ప్రయాణికులు వాపోతున్నారు.