నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నందున హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కు మూసివేశారు. పక్కనే ఉన్న మీర్ ఆలం ట్యాంక్ నుండి భారీగా నీరు రావడంతో పార్కులోని సఫారి పార్క్ కాంప్లెక్స్ తాత్కాలికంగా మూసివేశారు. భారీ వర్షపు నీటి నుండి జంతువులకు రక్షణ కల్పించడం.. బస్సులను నడపడం కూడా ఇబ్బంది అవడంతో అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.