రాంచీ టెస్ట్ డే 1: రహానే, రో'హిట్' జోడి అదిరింది
By న్యూస్మీటర్ తెలుగు Published on 19 Oct 2019 1:06 PM GMTరాంచీ: దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్ జరుగుతుంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా పటిష్ట స్థితిలోనే ఉందని చెప్పాలి. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ 164 బంతుల్లో 117 పరుగులు చేశాడు. శతకంతో సఫారీ బౌలర్లకు చక్కలు చూపించాడు.రోహాత్ క్రీజ్లోనే ఉన్నాడు. ఇక..వైస్ కెప్టెన్ రహానే 135బంతుల్లో 83 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. అయితే...ఆట మొదట్లో సౌతాఫ్రికా బౌలర్లు దూకుడు ప్రదర్శించారు .దక్షిణాఫ్రికా ఫేస్ బౌలర్ రబాడ ధాటికి మయాంక్ (10), పూజారా(0) వెను వెంటనే పెవిలియన్ చేరుకున్నారు. కోహ్లీ (12)కూడా అవుట్ కావడంతో టీమిండియాలో టెన్షన్ మొదలైంది. 39 పరుగులకే మూడు ప్రధాన వికెట్లను భారత్ కోల్పోయింది.
అయితే...కోహ్లీ తరువాత బ్యాటింగ్కు వచ్చిన రహానే ఇన్నింగ్స్ ఆచితూచి ఆడుతూ..రోహిత్కు సహకరించాడు. రహానే - రోహిత్ నాలుగో వికెట్కు అజేయంగా 185 పరుగులు జోడించి, భారత్ను పటిష్ట స్థితికి చేర్చారు. సౌతాఫ్రికాపై నాలుగో వికెట్ కు ఇదే అతి పెద్ద భాగస్వామ్యం. మొదటి రోజు ఆట కేవలం 58 ఓవర్లు మాత్రమే ఆడారు.