హైదరాబాద్: ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రగతి భవన్ కు వచ్చారు. సీఎం కేసీఆర్..ఏపీ సీఎంను సాదరంగా ఆహ్వానించారు. శాలువా, పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. తరువాత సీఎం కేసీఆరే జగన్ ను దగ్గరుండి లోపలికి తీసుకెళ్లారు. సీఎంలు ఇవ్వరు గోదావరి జలాలను శ్రీశైలానికి తరలింపుపై చర్చిస్తున్నారు. సీఎం జగన్ వెంట టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ఉన్నారు. తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారు.