హైదరాబాద్ : సీసీఎస్ ఉమెన్ పోలీసులకు నూతి రామ్మోహన్ రావు కోడలు సింధూ శర్మ సీసీ ఫుటేజ్ దృశ్యాలు అందజేశారు. ఏప్రిల్ 20న తనపై అత్తింటివారు దాడి చేశారని సింధూ శర్మ ఫిర్యాదులో పేర్కొంది. 22న మామ నూతి రామ్మోహన్ రావు టెక్నీషియన్ను పలిచి దాడి దృశ్యాలను డిలీట్ చేశారని ఆరోపించింది. తనపై అత్తింటి వారు దాడి చేశారని మరోసారి పోలీసులకు వివరించింది. అత్త,మామ, భర్తపై 307 సెక్షన్ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరింది సింధూ శర్మ.