ఈనెల 15 నుంచి ఓయూ పరీక్షలు
By సుభాష్ Published on 11 Sep 2020 5:11 AM GMTఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో యూజీలోని అన్ని కోర్సులలో చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులకు పరీక్షల పరీక్షల షెడ్యూల్ విడులైంది. ఈనెల 15వ తేదీ నుంచి దశల వారీగా పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు వర్సిటీ రిజిస్టార్ పీహెచ్ గోపాల్రెడ్డి అధ్యక్షతన స్టాండింగ్ క మిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కోర్సుల వారీగా షెడ్యూల్ను ఓయూ పరీక్షల విభాగం నియంత్రణ అధికారి శ్రీరామ్ వెంకటేష్ విడుదల చేశారు.
ఈనెల 15 నుంచి ఇంజనీరింగ్, ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్, బీసీఏ, బీఈడీ, ఎల్ఎల్బీ-3, 5వైడీసీ, ఎల్ఎల్ఎం, బీపీఈడీ పరీక్షలు మొదలు కానున్నాయి. అలాగే ఈనెల 22 నుంచి డిగ్రీలోని బీఎస్పీ, బీఏ,బీకాం, బీఎస్డబ్ల్యూ కోర్సుల చివరి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే ఎంఏ, ఎంకాం, ఎమ్మెల్సీ,ఎంఎస్డబ్ల్యూ పరీక్షలకు ఈనెల 14వ తేదీ వరకు ఫీజు చెల్లించాలని యూనివర్సిటీ సూచించింది. ఆలస్యం రుసుముతో ఈనెల 19 వరకు చెల్లించవచ్చని పేర్కొంది.
కీలక మార్పులు
కరోనా నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో చివరి ఏడాదిలో 1.10 లక్షల మంది విద్యార్థులుండగా, 65వేల మంది డిగ్రీ కోర్సులు, 20వేల మంది సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులు చదువుతున్నారు. మరో 25వేల మంది పీజీ కోర్సులు చేస్తున్నారు. ఈసారి విద్యార్థులు చదివే కాలేజీలలోనే పరీక్షలు నిర్వహించాలని ఓయూ నిర్ణయించింది.
కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య వంద దాటితో అదే కళాశాలలో పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది. అదే 50-60 మంది విద్యార్థులుంటే రెండు, మూడు కళాశాలను కలిపి ఒక కేంద్రంగా ఎంపిక చేస్తున్నారు. మొదటిసారిగా డిగ్రీ పరీక్షల్లో ఆన్లైన్ ద్వారా విద్యార్థుల హాజరును తీసుకోనున్నారు. ప్రస్తుతం హాజరు కాలేని విద్యార్థులకు రెండు నెలల తర్వాత మరోసారి పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.