ఆపరేషన్ డాల్ఫిన్స్ నోస్.. గూఢచర్యం గుట్టురట్టు
By రాణి Published on 20 Dec 2019 8:49 AM GMTకేంద్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, నావల్ ఇంటెలిజెన్స్తో పాటు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్... పాకిస్తాన్తో సంబంధాలున్న గూఢ చర్యం రాకెట్ను వెలికితీసినట్లు ఏపీ డిజిపి డి. గౌతమ్ సవాంగ్ కార్యాలయానికి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపాయి. నేవీ సంస్థ ద్వారా వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ఏడుగురు సిబ్బంది, ఒక హవాలా ఆపరేటర్ పై ఎఫ్ఐఆర్ ను నమోదు చేసినట్లు ఈ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఎనిమిది మంది శత్రుదేశ మైన పాకిస్థాన్ తో చేతులు కలిపి గూఢ చర్యం చేస్తున్నారని, మన దేశానికి సంబంధించిన సీక్రెట్లను శత్రు దేశానికి చేరవేస్తున్నారన్న అనుమానంతో వారందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ.
దీనిపై మరింత సమాచారాన్ని సేకరించేందుకు మరికొంత మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏపీ ఇలా అనుమానితులుగా ఉన్నవారిని అదుపులోకి తీసుకునేందుకు డీజీపీ గౌతమ్ సవాంగ్ చర్యలు తీసుకుంటున్నారు. నేవీ, సెంట్రల్ ఏజెన్సీలతో కలిసి ఆపరేషన్ డాల్ఫిన్స్ నోస్ ద్వారా గూఢచర్యం చేసే వారిని పట్టుకుని, వారిని విచారణ చేస్తామని గౌతమ్ సవాంగ్ తెలిపారు.