ఫిల్మ్ ఛాంబర్ వద్ద యువ హీరో ఆందోళన

By రాణి  Published on  10 Dec 2019 9:45 AM GMT
ఫిల్మ్ ఛాంబర్ వద్ద యువ హీరో ఆందోళన

హైదరాబాద్ : కొత్త సినిమా ''నాని గాడు'' చిత్రం విడుదల కాక ముందే యూట్యూబ్ లో లీక్ చేశారంటూ ఆ చిత్రం హీరో దుర్గా ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. యూట్యూబ్ లింక్ ను తొలగించి న్యాయం చేయకపోతే బుధవారం ఫిలింఛాంబర్ ఎదుట చిత్ర యూనిట్ మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించాడు. రూ.40 లక్షలు ఖర్చు పెట్టి సినిమా తీస్తే విడుదలకు ముందే యూట్యూబ్ లో సినిమా పెట్టడంపై అతను మండిపడ్డాడు. సినిమా విడుదల చేసేందుకు సెన్సార్ బోర్డు U సర్టిఫికేట్ కూడా ఇచ్చిందని, త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్న సమయంలో ఇలా చేశారని వాపోయారు. వెంటనే ఆ లింక్ ను తొలగించి తమకు న్యాయం చేయకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.

Next Story