ఎంపీని అడ్డుకుని వినతిపత్రం ఇచ్చిన రైతులు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Sep 2019 2:03 PM GMT
ఎంపీని అడ్డుకుని వినతిపత్రం ఇచ్చిన రైతులు..!

నరసరావుపేట: తమ గోడు వినండి అంటూ రైతులు ఎంపీని అడ్డుకున్నారు. అంతేకాదు..తమ సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. రైతుల అనుమతులు, అంగీకారం లేకుండా తమ పొలాల్లోంచి హెచ్‌.పి.సి.ఎల్‌ పైప్‌ లైన్లు వేస్తున్నారంటూ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పైప్ లైన్ వలన తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. చట్ట ప్రకారం రైతులకు హెచ్‌.పి.సి.ఎల్ కంపెనీ నుంచి నష్టపరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీకి అన్నదాతలు వినతిపత్రం ఇచ్చారు.

Next Story