జిన్ పింగ్ కు మోడి ఏమి కానుకలు ఇస్తున్నారో తెలుసా?

By సత్య ప్రియ  Published on  12 Oct 2019 7:12 AM GMT
జిన్ పింగ్ కు మోడి ఏమి కానుకలు ఇస్తున్నారో తెలుసా?

మమ్మల్లాపురంలో భారత్ ప్రధాని మోడి, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ల మధ్య సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. శనివారం మధ్యాహ్నానికి ఈ సమావేశాలు ముగిసి జిన్ పింగ్ తిరిగి చెన్నై బయలుదేరనున్నారు.

అయితే, ఈ సందర్భంగా జిన్ పింగ్ కు ఇచ్చేందుకు ప్రధాని అద్భుతమైన కానుకలు సిద్ధం చేసారు. ఆరు అడుగుల ఎత్తుండే నచైర్ కోయిల్, బంగారం పూత పూసిన రెండు ఇత్తడి దీపపు స్తంభాలు. మూడు అడుగుల ఎత్తు గల సరస్వతీ అమ్మవారి తంజావూరు పేయింటింగ్. ఈ పేయింటింగ్ లో అమ్మవారు నాట్యం చేస్తున్న భంగిమలో ఉంటారట.

తమిళనాడు హస్తకళా నైపుణ్యానికి అద్దం పట్టేలా ఉన్నాయట ఈ రెండు కానుకలు.

Next Story