విశాఖ ఘటనపై మోదీ సమీక్ష.. ప్రత్యేక కమిటీ ఏర్పాటు

By సుభాష్  Published on  7 May 2020 11:42 AM GMT
విశాఖ ఘటనపై మోదీ సమీక్ష.. ప్రత్యేక కమిటీ ఏర్పాటు

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమలో గ్యాస్‌ లీకేజీ ఘటనపై ప్రధాని మోదీ నేతృత్వంలో మంత్రులతో, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ గ్యాస్‌ లీకేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. కేబినెట్‌ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, కెమికల్‌ మినిస్ట్రీ కార్యదర్శులతో ఈ కమిటీ నియమించింది. గురువారం ప్రధాని నరేంద్రమోదీ, మంత్రులతో సమావేశం అయ్యారు. ప్రమాదానికి దారి తీసిన అంశాలపై చర్చించారు. అనంతరం ప్రత్యేక కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించారు మోదీ. గ్యాస్‌ ప్రభావం తగ్గింపు, బాధితులకు సహాయంపై కమిటీ చర్యలు చేపట్టనుంది.

ఘటన జరగడంపై మోదీ ట్విట్టర్‌ ద్వారా విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, బాధితులకు మెరుగైన చికిత్స అందించేలా చర్యలు చేపట్టాలన అధికారులను ఆదేశించారు.

Next Story