గోవాలో ఇండియన్ నేవీ మిగ్ -29 కె యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ట్రైనీ పైలెట్లు సురక్షితంగా బయటపడ్డారు. శిక్షణలో భాగంగా ఐఎన్ఎస్ హన్సా నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానం ఇంజిన్లో మంటలు చెలరేగాయి. గాయాలపాలైన పైలెట్లు కెప్టెన్ ఎం.షీఖండ్, లెప్టినెంట్ సిడిఆర్ దీపక్ యాదవ్ను నేవీ సిబ్బంది రక్షించి ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.