రూ. 20 లక్షలు, ఒకరికి ఉద్యోగం..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Sep 2019 8:24 AM GMT
రూ. 20 లక్షలు, ఒకరికి ఉద్యోగం..!

హైదరాబాద్ : అమీర్‌ పేట్ మెట్రో స్టేషన్‌లో పెచ్చులూడి పడి మౌనిక ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆమె కుటుంబానికి నష్టపరిహారం ఇచ్చేందుకు మెట్రో అధికారులు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. రూ.50లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని మౌనిక కుటుంబ సభ్యులు పట్టుబడుతున్నప్పటి్కీ..ఇన్సూరెన్స్‌ మాత్రమే ఇస్తామని మెట్రో అధికారులు అంటున్నట్లు సమాచారం. అయితే..ఎక్స్‌గ్రేషియా కాకుండా అధికారులు ఇన్సూరెన్స్‌ గురించి మాట్లాడుతుండటంపై మౌనిక బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే..రూ.20లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడానికి ఎల్‌ అండ్ టీ అధికారులు ఒప్పుకున్నట్లు సమాచారం.

Next Story