హైదరాబాద్ ప్రగతి భవన్ ముందు వ్యక్తి హల్చల్
By తోట వంశీ కుమార్ Published on : 17 May 2020 8:38 PM IST

సీఎం కేసీఆర్ క్యాంపు ఆఫీస్ ప్రగతి భవన్ ముందు ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ప్రగతి భవన్ సిబ్బంది వెంటనే అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అప్రమత్తమైన సిబ్బంది అతడిపై నీటిని కుమ్మరించారు. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని మలక్పేటలో చెప్పుల దుకాణం నడుపుతున్న ఎం.డీ నసీరుద్దీన్గా గుర్తించారు. లాక్ డౌన్ కారణంగా తన చెప్పుల షాప్ మూత పడడటంతో జీవనోపాథి కోల్పోయానని, అందుకే ఆత్మహత్య యత్నం చేశానని తెలిపాడు.
Next Story