లలితా జ్యువెలరీలో భారీ చోరీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Oct 2019 1:44 PM GMT
లలితా జ్యువెలరీలో భారీ చోరీ

చెన్నై: తమిళనాడులోని తిరుచ్చిలో భారీ చోరీ జరిగింది. లలితా జ్యువెలరీ షాప్‌కు కన్నం పెట్టిన ఇద్దరు దొంగలు.. రూ. 50 కోట్ల విలువైన బంగారం ఆభరణాలను ఎత్తుకెళ్లారు. షాప్ వెనక గోడకు కన్నంపెట్టి, ముఖాలకు మాస్కులు ధరించి షాపు లోపలికి వెళ్లారు దొంగలు. డిస్‌ప్లేలలో ఉంచిన బంగారాన్నంతా కాజేశారు. చోరీ అనంతరం దొంగలు బయటకు వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story