హీటెక్కిన 'స‌త్తెన‌ప‌ల్లి' రాజ‌కీయం.. కోడెల త‌న‌యుడి మంత‌నాలు

By Medi Samrat
Published on : 14 Oct 2019 5:24 PM IST

హీటెక్కిన స‌త్తెన‌ప‌ల్లి రాజ‌కీయం.. కోడెల త‌న‌యుడి మంత‌నాలు

సత్తెనపల్లి : మాజీ స్పీకర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు తనయుడు కోడెల‌ శివరాం నేడు పార్టీ నాయకులతో రహస్య భేటీ అయ్యారు. సుమారు 50 మందికి పైగా పట్టణ, మండల ముఖ్య నాయకులతో మంతనాలు జ‌రిపారు. ఈ సంద‌ర్భంగా రేపటి నుండి సత్తెనపల్లిలో అందరికీ అందుబాటులో ఉంటానని శివరాం వెల్లడించారు.

తండ్రి మరణం తర్వాత తొలిసారిగా సత్తెనపల్లికి వ‌చ్చిన‌ శివరాం.. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ పరిస్థితిపై ఆరా తీసారు. నాయకులు, కార్యకర్తలు మనోధైర్యం తెచ్చుకోవాలని సూచించారు. ఇదిలావుంటే.. శివ‌రాం నేడు చంద్రబాబును కలవనున్నార‌ని స‌మాచారం. అలాగే.. రేపు నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నాడు. ఇప్పటికే రాయపాటి తనయుడు రంగారావు సత్తెనపల్లిలో ఉన్న నేపథ్యంలో ఇక్క‌డి రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి.

Next Story